ముఖ్యమంత్రి సహాయ నిధికి అరబిందో ఫార్మా 5కోట్లు విరాళం



 వరద బాధితుల సహాయార్థం ప్రఖ్యాత అరబిందో ఫార్మా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్లు విరాళం ఇచ్చింది. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క గార్లను సంస్థ ప్రతినిధులు కలిసి, విరాళం చెక్కును అందజేశారు.


సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసినవారిలో అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానంద రెడ్డి గారు, డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి గారు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఐఎస్ఆర్ రావు గారు ఉన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో అరబిందో ఫార్మా సంస్థ చూపిన ఔదార్యాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అభినందించారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు