ఆరు దశాబ్దాలుగా వెనుక బడిన అభివృద్ధిని దశాబ్దంలోనే పూర్తి చేసుకున్నాం..

 










కారు గుర్తుకు ఓటు వేసి... కావాల్సినంత అభివృద్ధి చేసుకుందాం....


గత ఆరు దశాబ్దాలుగా వెనుక బడిన అభివృద్ధిని కేవలం ఒక్క దశాబ్ది కాలంలోనే పూర్తి చేసుకున్నామని అన్నారు బి అర్ ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్ధి *అరూరి రమేష్* గారు...


*పర్వతగిరి మండలం ఎబి తండా,చింత నెక్కొండ,బట్టు తండా,తూర్పు తండా, గుగులోత్ తండా, ఏనుగల్, మాల్యా తండా, ముడేత్తుల తండా,శ్రీనగర్, కొంకపాక, గోపనపల్లి మరియు అనంతారం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అరూరి....*


 ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు, మహిళలు, ప్రజలు  డప్పు చప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మలు, మంగళ హరతులతో రమేష్ గారికి ఘన స్వాగతం పలికారు. 


అనంతరం అరూరి రమేష్ గారు మాట్లాడుతూ 

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్‌ కు లేదనీ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ చెప్పే వారంటీ లేని గ్యారెంటీ కార్డును ప్రజలు నమ్మవద్దని తెలిపారు. గతంలో ఎన్నో ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్‌ హయాంలో మంచినీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోయిందో ఒకసారి ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఆచరణకు సాధ్యం కానీ హామీల పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్న కాంగ్రెస్‌ కు డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పాలని తెలిపారు. బాధ్యతాయుతమైన బిఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టోతోనే ప్రజలకు భరోసా అన్నారు. మన సమస్యలు మనమైతేనే పరిష్కరించుకోగలుగుతాం, మన కారు గుర్తుకు ఓటేసి మన సారును గెలిపించుకొని మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. తనను మరోసారి ఎమ్మెల్యేగా ఆదరిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి కెసిఆర్‌, కేటీఆర్‌ ల సహకారంతో వర్దన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
















కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు