హసన్ పర్తి న్యూస్||తెరాస పార్టీలోకి చేరికలు

 



Hasanparthy

గ్రేటర్ వరంగల్ 66వ డివిజన్ హాసన్ పర్తికి నుండి సుమారు 50మంది యువకులు బీజేపీ పార్టీ నుండి హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని ఎమ్మెల్యే గారి నివాసం వద్ద టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారి సమక్షంలో టీఆరెఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బీజేపీ జిల్లా యువజన విభాగం కార్యదర్శి కందుకూరి సాయి చంద్, పాపిశెట్టి విజయ్, గుండమిది విజయ్ మోహన్, మొట్ట గణేష్, వినీత్, గౌరీశెట్టి శ్రీనివాస్ తో పాటు సుమారు 50మంది యువకులు టీఆరెఎస్ పార్టీ లో చేరారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో కొత్త పాత అనే తేడా లేకుండా అందరిని కలుపుకొని ముందుకు వెళ్లాల్లడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ నాయకులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని తెలిపారు.


ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రసిడెంట్ పాపిశెట్టి శ్రీధర్, శ్రీకాంత్, స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు