పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే అరూరి
వర్దన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్ర భాగాన నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్నానని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు.గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ ఆరెపల్లి పరిధిలో 85లక్షలతో చెప్పట్టిన సిసి రోడ్డు, బిటీ రోడ్డు పనులకు శంకుస్థాపన మరియు కొత్తపేట గ్రామంలో 2కోట్లతో చేపట్టిన వాటర్ ట్యాంక్, అంతర్గత పైప్ లైన్ పనులు మొత్తం 2కోట్ల 85లక్షల విలువైన పనులకు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం డివిజన్ పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 50మంది మహిళలు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం లో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. ప్రజా సంక్షేమమే ద్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పని చేస్తున్నారని తెలిపారు. రైతు బందు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్ వంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఇంటికి అందిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దేశ ప్రజలకు అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ గారు జాతీయ పార్టీకి రూపకల్పన చేశారాని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జన్ను శిభారాణి అనిల్, జిల్లా రైతు బందు సమితి అధ్యక్షురాలు లలితా యాదవ్, డివిజన్ ప్రెసిడెంట్ నేరెళ్ల రాజు, పీఎసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి